హంతకులను శిక్షించాలి
ABN , First Publish Date - 2021-07-24T05:12:31+05:30 IST
ముప్పాళ్లలో గురువారం సాయంత్రం హత్యకు గురైన విద్యార్థి అఫ్రిద్ హంతకులను తమకు అప్పగించాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు గ్రామంలో రాస్తారోకో చేశారు
ఆఫ్రిద్ కుటుంబ సభ్యుల ఆందోళన
ముప్పాళ్ల, జూలై 23: ముప్పాళ్లలో గురువారం సాయంత్రం హత్యకు గురైన విద్యార్థి అఫ్రిద్ హంతకులను తమకు అప్పగించాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు గ్రామంలో రాస్తారోకో చేశారు. గంటకు పైగా జరిగిన రాస్తారోకోలో సత్తెనపల్లి, నరసరావుపేట ప్రధాన రహదారిలో రోడ్డుకిరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. నరసరావుపేటలో పోస్టుమార్టం అనంతరం అఫ్రీద్ మృతదేహాన్ని ముప్పాళ్లకు తీసుకురావటంతో అఫ్రిద్ తల్లిదండ్రులు అయుబ్ఖాన్, సైదాబిలు బోరున విలపించారు. రాస్తారోకోలో పాల్గొన్న వారితో సత్తెనపల్లి రూరల్సీఐ బి.నరసింహారావు, ఎస్ఐ పట్టాభిరామయ్య మాట్లాడి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు.