మల్లారెడ్డి కాలేజి వద్ద ఆందోళన.. 13 మందిపై కేసు

ABN , First Publish Date - 2021-05-08T16:24:39+05:30 IST

హైదరాబాద్: మల్లారెడ్డి మెడికల్ కాలేజి వద్ద ఆందోళన చేసిన ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్‌తో పాటు 13 మంది విద్యార్థి నాయకులపై 8 సెక్షన్ల కింద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మల్లారెడ్డి కాలేజి వద్ద ఆందోళన.. 13 మందిపై కేసు

హైదరాబాద్: మల్లారెడ్డి మెడికల్ కాలేజి వద్ద ఆందోళన చేసిన ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్‌తో పాటు 13 మంది విద్యార్థి నాయకులపై 8 సెక్షన్ల కింద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. 427, 447, 452 లాంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. విద్యార్థి నాయకులు ఇంకా పోలీస్ స్టేషన్లలోనే ఉన్నారు. కొద్దిసేపట్లో మేడ్చల్ కోర్టు మేజిస్టేట్ ముందు (కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసం) పోలీసులు హాజరు పర్చనున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న విద్యార్థి నాయకులను ఎమ్యెల్యే సీతక్క పరామర్శించారు.


Updated Date - 2021-05-08T16:24:39+05:30 IST