కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన

ABN , First Publish Date - 2020-07-06T17:12:04+05:30 IST

కర్నూలు: కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. ఆధార్ దిగేందుకు ప్రజలు భారీగా హెడ్ పోస్టు ఆఫీస్ వద్దకు చేరుకున్నారు.

కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళన

కర్నూలు: కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. ఆధార్ దిగేందుకు ప్రజలు భారీగా హెడ్ పోస్టు ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రజలు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్థరాత్రి నుంచి ఇక్కడ ఉన్నామని.. ఇప్పడు వెళ్లమంటే ఎలా అని పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. ఆధార్ కోసం రోజూ తిప్పుతిన్నారని.. కనీసం ఈ రోజు అయినా తీసుకోవాలని ఇక్కడ ఉన్నామని ప్రజలు చెబుతున్నారు.

Updated Date - 2020-07-06T17:12:04+05:30 IST