కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-06-22T06:21:33+05:30 IST
కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కళాకారులు సోమవారం స్పందనలో వినతిపత్రం అందజేశారు.
గుంటూరు (తూర్పు), జూన్ 21: కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కళాకారులు సోమవారం స్పందనలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు గుర్తింపు కార్డులను ఇచ్చి వారికి ప్రభుత్వ పథకాలను అమలుచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కళాకారులను భాగస్వాములుగాచేసి వారికి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.