బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసన
ABN , First Publish Date - 2021-05-06T04:15:26+05:30 IST
పశ్చిమబెంగాల్లో బీజేపీ నేతలపై దాడులను ఖండిస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వారి నివాసాల్లో బుధవారం నిరసన
కావలిటౌన్, మే 5: పశ్చిమబెంగాల్లో బీజేపీ నేతలపై దాడులను ఖండిస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వారి నివాసాల్లో బుధవారం నిరసన తెలిపారు. ఆ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కె.బ్రహ్మానందం, బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మురళీకృష్ణ నాయుడు, నియోజకవర్గ కన్వీనర్ సీవీసీ సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి వాయుగండ్ల సుదీర్, మందా కిరణ్, తిరుపతిస్వామి, సుందర్శెట్టి సుజి, జలదంకి విజయ్, సవిండ్ర, అనిత, కె.ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.