వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-05-17T06:13:23+05:30 IST

జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళలు ఆరోపించారు. రాష్ట్రంలోని మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు నిరసిస్తూ ఒంగోలులో తెలుగు మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు మహిళలు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయన్నారు.

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువు
ఒంగోలు నగరంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తెలుగు మహిళలు

- తెలుగు మహిళల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

ఒంగోలు (కార్పొరేషన్‌), మే 16 : జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళలు ఆరోపించారు. రాష్ట్రంలోని మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు నిరసిస్తూ ఒంగోలులో తెలుగు మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు మహిళలు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయన్నారు.  ఎన్నికలకు ముందు మహిళలకు పెద్దపీట వేస్తామని, ప్రతి మహిళకు పెద్దన్నగా ఉంటామని అబద్ధపు హామీలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ తమ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నదని, రాజకీయ ప్రాధాన్యత కోసం పనిచేస్తున్నదని ఆరోపించారు. మూడేళ్లుగా రాష్ట్రంలో అనేకమంది మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగితే ఒక్కదానికి కూడా స్పందించలేదని, నిందితులపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఈసందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి జగన్‌ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల పద్మజ, ప్రధాన కార్యదర్శి బీరం అరుణ, సీనియర్‌ నాయకులు ఉప్పలపాటి నాగేంద్రం, ఎల్టీ భవానీ, గంగవరపు పద్మ, టి. అనంతమ్మ, నిడమనూరి పావని, వరలక్ష్మి, మేరి రత్న కుమారి, నాళం నరసమ్మ, పలువురు తెలుగు మహిళలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:13:23+05:30 IST