రైల్వే ఆస్తులను కాపాడరూ..

ABN , First Publish Date - 2021-10-29T05:00:54+05:30 IST

మెదక్‌లో రైలు కూత పెట్టకముందే స్టేషన్‌లోని పరికరాలు ధ్వంసమవుతున్నాయి

రైల్వే ఆస్తులను కాపాడరూ..
మెదక్‌ రైల్వేస్టేషన్‌

 ఆంధ్రజ్యోతిప్రతినిధి,మెదక్‌, అక్టోబరు28 : మెదక్‌లో రైలు కూత  పెట్టకముందే స్టేషన్‌లోని  పరికరాలు ధ్వంసమవుతున్నాయి. పర్యవేక్షణ కొరవడడంతో విలువైన పరికరాలను ఆకతాయిలు నాశనం చేశారు. డోర్లు, కిటికీ అద్దాలను పగులగొట్టారు. మరికొన్నింటిని ఎత్తుకెళ్లారు. ఫలితంగా రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రైల్వేస్టేషన్‌ ప్రారంభానికి ముందే అస్తవ్యస్తంగా మారుతున్నది. స్టేషన్‌ పూర్తిచేసి ఏడాది దాటినా రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాగా మారింది.  



Updated Date - 2021-10-29T05:00:54+05:30 IST