అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-06-01T11:15:54+05:30 IST

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకో వాలని అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల సంఘ నాయకులు పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు ఆదివారం వినతిపత్రం అం దించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్డ్‌ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోండి

పలాస, మే 31: బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకో వాలని అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల సంఘ నాయకులు పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు ఆదివారం వినతిపత్రం అం దించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్డ్‌ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ కాళి దాస్‌, కుప్పిలి రాజు, శ్రీనివాసపాత్రో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పందించి అగ్రిగోల్డ్‌  బాధితులకు  కొంత వరకు న్యాయం చేశార న్నారు. మిగిలిన బాధితులకు కూడా న్యాయం చేసి  కుటుంబాలను ఆదుకోవాలని  కోరారు. తొలుత  ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేకు సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మణ రావు పాత్రో, రమేష్‌చంద్ర, కె.శివప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T11:15:54+05:30 IST