చెరువులను పరిరక్షించుకోండి

ABN , First Publish Date - 2021-02-28T05:48:29+05:30 IST

గ్రామాల్లో ఉన్న చెరువులను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. రాజాపులోవ గ్రామ సమీపంలో శనివారం నిర్వహించిన చెరువు శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

చెరువులను పరిరక్షించుకోండి
చెరువుశుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌

  కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

భోగాపురం, ఫిబ్రవరి 27: గ్రామాల్లో ఉన్న చెరువులను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. రాజాపులోవ గ్రామ సమీపంలో శనివారం నిర్వహించిన చెరువు శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా  మాట్లాడుతూ చెరువులు ప్రజల ఆస్తులని, వాటిలో చెత్త వేసి నాశనం చేయొద్దని సూచించారు. అనంతరం చెరువులోగల చెత్త, తుప్పలను తొలగించారు. ఈ కార్యక్రమంలో డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌, డీఎల్‌పీవో మోహనరావు, ఎంపీడీవో డి.బంగార య్య, ఏపీవో ఆదిబాబు, హరిత విజయనగరం సిబ్బంది, ఫైర్‌ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-28T05:48:29+05:30 IST