అటవీ సంపదను కాపాడాలి: డీఎఫ్వో
ABN , First Publish Date - 2021-06-22T05:27:37+05:30 IST
అటవీ సంపదను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు.
కోహీర్, జూన్ 21: అటవీ సంపదను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలోని గోటిగర్పల్లి, బడంపేట గ్రామంలో గల అటవీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్నా ప్లాంటేషన్ ప్రాంతా న్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుకు కృషిచేసిన ఎంపీడీవో సుజాత నాయక్, ఎంపీవో వెంకట్ రెడ్డిని డీఎఫ్వో అభినందించారు.