నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

ABN , First Publish Date - 2020-03-28T06:32:11+05:30 IST

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసు కో వాలని మూడు చింతలపల్లి ఎంపీ డీవో సువిధ అన్నారు. శుక్రవారం మండ లంలోని అనం తారం, నారా యణపూర్‌లోని...

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

శామీర్‌పేట రూరల్‌ : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసు కో వాలని మూడు చింతలపల్లి ఎంపీ డీవో సువిధ అన్నారు. శుక్రవారం మండ లంలోని అనం తారం, నారా యణపూర్‌లోని నర్స రీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలకు సాసరింగ్‌ చే యాలని ఫీల్డ్‌అసిస్టెంట్లకు సూ చించారు. మొక్కలకు ఎప్పటి కప్పుడు నీళ్లు పట్టాలని వన సే వకులను ఆదేశించారు. వేసవికాలంలో మొక్కలు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న దని ప్రతి మొక్కకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లింగాపూర్‌తాండ సర్పంచ్‌ దీరావత్‌ గోపి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలకు స్వయంగా నీళ్లు పట్టారు. మొక్కల సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్దెమర్రిలోని నర్సరీని సర్పంచ్‌ అనురాధరవీందర్‌రెడ్డి సందర్శించారు. 

Updated Date - 2020-03-28T06:32:11+05:30 IST