లాడ్జిలో వ్యభిచారం.. ఆట కట్టించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-08-11T00:30:49+05:30 IST

తిరుపతి: లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. అలిపిరి బైపాస్ రోడ్డులో ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

లాడ్జిలో వ్యభిచారం.. ఆట కట్టించిన పోలీసులు

తిరుపతి: లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. అలిపిరి బైపాస్ రోడ్డులో ఓ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. జ్యోతి అనే మహిళ పశ్చిమ బెంగాల్, మహరాష్ట్రకు చెందిన యువతులను తిరుపతికి రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. వాట్సప్ ద్వారా విటులకు వల విసిరి కార్యక్రమం సాగిస్తున్నారనే పక్కా సమాచారంతో అలిపిరి పోలీసులు దాడి చేశారు. వ్యభిచారంలో పాల్గొన్న ఇద్దరు విటులతో పాటు లాడ్జి మేనేజర్, రూంబాయ్‌ను అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. త్వరలోనే హైటెక్ వ్యభిచార ముఠా నిర్వాహకురాలు జ్యోతిని అరెస్టు చేస్తామని అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ తెలిపారు.

Updated Date - 2021-08-11T00:30:49+05:30 IST