Hyderabad : హోటల్‌ గదిలో వ్యభిచారం.. ముగ్గురికి రిమాండ్

ABN , First Publish Date - 2021-07-18T15:13:46+05:30 IST

హోటల్‌లోని గదిని అద్దెకు తీసుకుని...

Hyderabad : హోటల్‌ గదిలో వ్యభిచారం.. ముగ్గురికి రిమాండ్

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : చిక్కడపల్లిలోని ఓ హోటల్‌ గదిలో వ్యభిచారగృహం నడుపుతున్నట్టు తెలిసిన చిక్కడపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. మేనేజర్‌ బి.ఉషశ్రీ(22) సహా హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇ.శ్రీకాంత్‌(24), కె.సాయికుమార్‌(23)లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, పది నిరోధ్‌ ప్యాకెట్లు, 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ పాలడుగు శివశంకరరావు వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఉషశ్రీ.. హోటల్‌లోని గదిని అద్దెకు తీసుకుని సెక్స్‌వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ- ఫిఫ్టీ షేరింగ్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ చేస్తున్న సిద్దిపేటకు చెందిన శ్రీకాంత్‌, నల్గొండకు చెందిన సాయికుమార్‌ ఆమెకు సహకరించేవారు. సెక్స్‌వర్కర్లను తీసుకువచ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న విష్ణు, ధర్మ పరారీలో ఉన్నారు. సీసీఎస్‌ పోలీసులు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.

Updated Date - 2021-07-18T15:13:46+05:30 IST