కూతురి పెళ్లికి డబ్బులకోసం పిల్లాడి కిడ్నాప్.. పిల్లాడిని భారీ ధరకు అమ్మకం.. చివరికి పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

ABN , First Publish Date - 2022-04-12T08:36:44+05:30 IST

తన కుమార్తెకు పెళ్లి చేయడం కోసం ఒక తల్లి ఘోరమైన పథకం వేసింది. పెళ్లి చేయడానికి సొమ్ము లేదని, దారుణానికి ఒడిగట్టింది. తనకు తెలిసిన మరో మహిళతో కలిసి ఒక రెండేళ్ల పసివాడిని కిడ్నాప్ చేసింది...

కూతురి పెళ్లికి డబ్బులకోసం పిల్లాడి కిడ్నాప్.. పిల్లాడిని భారీ ధరకు అమ్మకం.. చివరికి పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

తన కుమార్తెకు పెళ్లి చేయడం కోసం ఒక తల్లి ఘోరమైన పథకం వేసింది. పెళ్లి చేయడానికి సొమ్ము లేదని, దారుణానికి ఒడిగట్టింది. తనకు తెలిసిన మరో మహిళతో కలిసి ఒక రెండేళ్ల పసివాడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలో వెలుగు చూసింది. 


ఢిల్లీ సమీపంలోని మునిరకా గ్రామంలో అంశ్ అనే రెండేళ్ల పసివాడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు చుట్టుపక్కల ఎంక్వయిరీలు చేసి, సీసీ కెమెరాలు పరిశీలించారు. వాటిలో హీనా అలియాజ్ నిక్కీ అనే మహిళే పసివాడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమె ఇంట్లో తనిఖీలు చేసి పసివాడిని కాపాడారు. అదే సమయంలో హీనాను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా నివశించే బబ్లీ అనే మహిళ చెప్తేనే తాను ఈ కిడ్నాప్ చేసినట్లు హీనా వెల్లడించింది. 


వేశ్యా వృత్తి చేస్తూ జీవించే బబ్లీ అనే మహిళ తన కూతురికి పెళ్లి చేయాలనుకుందని, కానీ దానికి సరిపడా డబ్బు లేకపోవడం వల్లనే ఈ కిడ్నాప్ ప్లాన్ వేసిందని దర్యాప్తులో తేలింది. ఆమె ప్రోద్బలంతోనే హీనా పసివాడిని కిడ్నాప్ చేసింది. పిల్లాడిని ఎవరికైనా భారీ ధరకు అమ్మేసి, ఆ డబ్బుతో కుమార్తె పెళ్లి చేయాలనేది బబ్లీ ప్లాన్. విషయం తెలుసుకున్న అధికారులు.. బబ్లీ, హీనా ఇద్దరినీ అదుపులోకి తీసుకొని అంశ్‌ను కాపాడారు.


Updated Date - 2022-04-12T08:36:44+05:30 IST