ఆస్తి పన్ను పెంపు జీవో ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2021-06-20T05:44:59+05:30 IST
ఆస్తి పన్ను పెంపు జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానిక జోనల్ కమిషనర్కు టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు.
గాజువాక, జూన్ 19: ఆస్తి పన్ను పెంపు జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానిక జోనల్ కమిషనర్కు టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత సమయంలో ఆస్తి పన్ను పెంపు సరి కాదన్నారు. ప్రజలపై ఆర్థిక భారం మోపవద్దని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎన్.అప్పారావు, పెరుమాళ్లు, పెంటిరాజు పాల్గొన్నారు.