ఇద్దరు కార్యదర్శులకు పదోన్నతులు

ABN , First Publish Date - 2021-01-27T05:41:35+05:30 IST

ఇద్దరు కార్యదర్శులకు పదోన్నతులు

ఇద్దరు కార్యదర్శులకు పదోన్నతులు
మధుసూదన్‌రెడ్డికి దృవీకరణపత్రాన్ని అందజేస్తున్న జెడ్పీచైర్మన్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్‌వన్‌ పంచాయతీ అధికారులుగా పదోన్నతులు పొందారు. అంకుశాపూర్‌లో కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, చౌదరిగూడ కార్యదర్శి మధుసూధన్‌రెడ్డిలు గ్రేడ్‌వన్‌ పంచాయతీ అధికారులుగా పదోన్నతులు పొందారు. వీరికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణిలు దృవీకరణపత్రాన్ని అందజేశారు. ఈ కార్యదర్శులు మాట్లాడుతూ ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను కల్పించిన రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ ఎంపీడీవో వై.అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:41:35+05:30 IST