16 మందికి డీటీలుగా పదోన్నతులు
ABN , First Publish Date - 2021-01-21T05:18:40+05:30 IST
జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 16 మంది సీనియర్ సహాయకులకు ఉప తహసీల్దార్లుగా (డీటీ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏలూరుసిటీ, జనవరి 20: జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 16 మంది సీనియర్ సహాయకులకు ఉప తహసీల్దార్లుగా (డీటీ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ శాఖలో సీనియర్ సహాయ కులకు డీటీలుగా పదోన్నతులు కల్పించిన జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తిలకు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రమోద్కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వెంకట్ రాజేశ్ కృతజ్ఞతలు తెలిపారు.