కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్కు పదోన్నతి
ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST
కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రవికిరణ్కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కడప(క్రైం), జూలై 27: కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రవికిరణ్కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనకు జైళ్లశాఖ డీఐజీగా పదోన్నతి కల్పించి కడపకు కేటాయించారు. ఇక్కడ పనిచేస్తున్న డీఐజీ వరప్రసాద్ను గుంటూరుకు బదిలీ చేశారు.