వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం
ABN , First Publish Date - 2020-05-23T10:09:31+05:30 IST
జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు.
కలెక్టర్ హరిజవహర్లాల్ వెల్లడి
విజయగనరం-ఆంధ్రజ్యోతి, మే22: జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. రీస్టార్ట్ట్ పాలసీతో జిల్లాలో 59 పరిశ్రమలకు రూ.15.82 కోట్ల మేర లబ్ధి చేకూరనుందన్నారు. 194 క్లైయిమ్లు పరిష్కారం కాను న్నాయని చెప్పారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రకృతి సేద్యం, సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు, రొయ్యల ప్రోసెసింగ్ యూని ట్లకు, కొబ్బరి పీచు, జూట్ పరిశ్రమలను ప్రోత్సహి స్తామన్నారు. నిరుద్యోగ యువత జిల్లాలోని పరిశ్రమల్లో పనిచేసేందుకు వీలుగా శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ కిశోర్కుమార్, పరిశ్రమల శాఖ జీఎం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.