కూరగాయల సాగును ప్రోత్సహించండి

ABN , First Publish Date - 2022-06-30T08:45:11+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏఈవో వంద మంది రైతులను ఎంపిక చేసుకొని వారిని ఉద్యాన, కూరగాయల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని

కూరగాయల సాగును ప్రోత్సహించండి

అధికారులతో మంత్రి నిరంజన్‌..పంటల నమోదు ‘యాప్‌’ విడుదల 

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏఈవో వంద మంది రైతులను ఎంపిక చేసుకొని వారిని ఉద్యాన, కూరగాయల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు సంయుక్త ప్రణాళికలు తయారుచేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో బంతిపూల మొక్కలు నాటాలని సూచించారు. కాగా, ఏఈవోలు పంటల నమోదు చేయటానికి రూపొందించిన ‘ఏఈవో యాప్‌’ను మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఏ సర్వే నెంబరులో? ఏ రైతు? ఏ పంట? వేశారనే వివరాలను ఏఈవోలు ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అదేక్రమంలో ఏఈవోల ప్రొఫైల్‌, సెల్ఫీ ఇమేజ్‌లు, రైతు వేదికలో సమావేశాలు, రెవెన్యూ గ్రామాల వారీ వివరాలు, రైతుబీమా క్లెయిమ్స్‌ వెరిఫికేషన్‌... తదితర వివరాలనూ నమోదు చేయనున్నారు.  

Updated Date - 2022-06-30T08:45:11+05:30 IST