దేశ సమైక్యతను చాటండి: ఎస్పీ
ABN , First Publish Date - 2022-08-08T04:44:10+05:30 IST
దేశానికి సాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమైక్యతను చాటాలని ఎస్పీ రఘువీర్రెడ్డి పిలుపునిచ్చారు.
నంద్యాల(నూనెపల్లి), ఆగస్టు 7: దేశానికి సాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమైక్యతను చాటాలని ఎస్పీ రఘువీర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాలలో అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కెట్ యార్డు నుంచి 300 అడుగుల జాతీయ జెండాతో ఫ్లాగ్మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ మహేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ర్యాలీని ఎస్పీ రఘువీర్రెడ్డి ప్రారంభించారు. గాంధీ చౌక్ వద్దకు ర్యాలీగా చేరుకొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.