ప్రాజెక్టుల్ని తక్షణమే పూర్తి చేయాలి: జక్కలి
ABN , First Publish Date - 2020-09-21T07:54:45+05:30 IST
ప్రాజెక్టుల్ని తక్షణమే పూర్తి చేయాలి: జక్కలి
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి జక్కలి ఐలయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథతోనే తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందంటూ ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన నేడొక ప్రకటనలో విమర్శించారు. టీడీపీ హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు.