రూ.3.5 లక్షల గుట్కాల స్వాధీనం

ABN , First Publish Date - 2021-01-27T05:07:53+05:30 IST

రూ.3.5 లక్షల గుట్కాల స్వాధీనం

రూ.3.5 లక్షల గుట్కాల స్వాధీనం
గుట్కాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసిన సెబ్‌ అధికారులు

ఇద్దరి అరెస్టు

వెంకటగిరి(టౌన్‌), జనవరి 26: కారులో అక్రమంగా తరలిస్తున్న 3.5 లక్షల విలువైన గుట్కాలు, పాన్‌ మసాలాలను మంగళవారం  వల్లివేడు క్రాస్‌ వద్ద స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌  పి. విజయ్‌కుమార్‌ తెలిపారు. తిరుపతికి చెందిన టీ. పవన్‌ కుమార్‌, ఎం. చంద్ర చారిలను అరెస్టుచేశామని,  వారి నుంచి 33,840 గుట్కాలు, పాన్‌ మసాలా ప్యాకెట్లు, టాటా ఇండికా కారును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించామని తెలిపారు. దొమ్మరపాళెంలో ఎస్‌. గిరి, ఎస్‌. బాలాజీ  ఇళ్లలో దాడులు  చేసి 10లీటర్లు, శంకరయ్య ఇంట్లో  2 లీటర్ల నాటు సారాని స్వాధీనం చేసుకుని వారిని కూడా అరెస్టు చేశామని తెలిపారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ రేవతి, ప్రసాద్‌, తిరుమల, శ్రీను, కృష్ణ, గురవయ్య, రవి పాల్గొన్నారు. 

మసాలా ప్యాకెట్లు, టాటా ఇండికా కారును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించామని తెలిపారు. దొమ్మరపాళెంలో ఎస్‌. గిరి, ఎస్‌. బాలాజీ ఇళ్లలో దాడులు చేసి 10లీటర్లు, శంకరయ్య ఇంట్లో 2 లీటర్ల నాటు సారాని స్వాధీనం చేసుకుని వారిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రేవతి, ప్రసాద్‌, తిరుమల, శ్రీను, కృష్ణ, గురవయ్య, రవి పాల్గొన్నారు. మసాలా ప్యాకెట్లు, టాటా ఇండికా కారును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించామని తెలిపారు. దొమ్మరపాళెంలో ఎస్‌. గిరి, ఎస్‌. బాలాజీ  ఇళ్లలో దాడులు  చేసి 10లీటర్లు, శంకరయ్య ఇంట్లో  2 లీటర్ల నాటు సారాని స్వాధీనం చేసుకుని వారిని కూడా అరెస్టు చేశామని తెలిపారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ రేవతి, ప్రసాద్‌, తిరుమల, శ్రీను, కృష్ణ, గురవయ్య, రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:07:53+05:30 IST