నిషేధిత గడ్డిమందు పట్టివేత
ABN , First Publish Date - 2022-08-08T04:10:55+05:30 IST
మహారాష్ట్రనుంచి అక్రమంగా బస్సులో తరలిస్తున్న నిషే ధిత గ్లైకోసెట్ గడ్డిమందును ఆదివారం పోలీసులు పట్టుకున్నారు.
వాంకిడి, ఆగస్టు 7: మహారాష్ట్రనుంచి అక్రమంగా బస్సులో తరలిస్తున్న నిషే ధిత గ్లైకోసెట్ గడ్డిమందును ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పోలీస్స్టేషన్లో ఎస్సై డీకొండ రమేష్, వ్యవసాయ అధికారి మిలింద్ ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో పట్టుకున్న గడ్డిమందు వివరాలను వెల్ల డించారు. ఆదివారం వాహనాలతనిఖీల్లో భాగంగా మహారాష్ట్ర నుంచి వస్తున్న బస్సును పోలీసులు తనిఖీలు చేయగా భీమిని మండలం వెంకటా పూర్ గ్రామానికి చెందిన రాసెట్టిచందు(30) తోటరాజు(42)మైదం లచ్చయ్య (32) రాజేష్(25) 115లీటర్ల నిషేధిత గ్లైకోసెట్ గడ్డిమందును బస్సులో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుకున్న నిషేధిత గడ్డి మందు విలువ రూ. 1,38,000 ఉంటుందన్నారు. పట్టుకున్న గడ్డిమందును స్వాధీనం చేసుకొని వ్యవసాయశాఖ అధికారిమిలింద్ సమక్షంలో పంచనామా జరిపి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.