ఎన్ఎల్ఎస్ఏ సభ్యురాలిగా ప్రొఫెసర్ బీనా

ABN , First Publish Date - 2021-07-31T00:37:55+05:30 IST

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ( ఎన్ఎల్ఎస్ఏ ) సభ్యురాలిగా తెలంగాణ

ఎన్ఎల్ఎస్ఏ సభ్యురాలిగా ప్రొఫెసర్ బీనా

ఢిల్లీ: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ( ఎన్ఎల్ఎస్ఏ ) సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ బీనా చింతలపూరి నియమితులయ్యారు. ప్రొ.బీనా చింతలపూరిని నియమిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్ఎల్ఎస్ఏ సభ్యుల నియామకాలపై సీజేఐ ఎన్వీ రమణను కేంద్రం సంప్రదించింది. జైళ్లు, ఖైదీలకు సంబంధించి సంస్కరణల కోసం  చింతలపూరి విశిష్ట కృషి చేసారు. ప్రొఫెసర్ బీనా నియామకానికి జస్టిస్ రమణ తోడ్పాటును అందించారు. ఓయూలో సైకాలజీ ప్రొఫెసర్‌గా బీనా చింతలపూరి పనిచేసారు. బీనా చింతలపూరితో పాటు సభ్యులుగా సీనియర్ న్యాయవాదులు మీనాక్షి అరోరా, వీ విశ్వనాధన్, సిద్ధార్థ, లూద్ర, సామాజిక కార్యకర్త ప్రవీణ్‌ పాట్కర్‌లను నియామించారు. 

Updated Date - 2021-07-31T00:37:55+05:30 IST