శ్రీవాణి ట్రస్టు భక్తుల దర్శనంపై టీటీడీ పునరాలోచించాలి: నిర్మాత అంబికా కృష్ణ

ABN , First Publish Date - 2021-02-27T14:49:34+05:30 IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిని శనివారం ఉదయం సినీ నిర్మాత అంబికాకృష్ణ దర్శించుకున్నారు.

శ్రీవాణి ట్రస్టు భక్తుల దర్శనంపై టీటీడీ పునరాలోచించాలి: నిర్మాత అంబికా కృష్ణ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిని శనివారం ఉదయం సినీ నిర్మాత అంబికాకృష్ణ దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు కలిగిన భక్తులకు టీటీడీ సరైన దర్శనం కల్పించడం లేదన్నారు. రాను...రాను...శ్రీవాణి ట్రస్టు భక్తులకు కల్పించే దర్శనం స్వదర్శనం లాగా ఉంటోందని తెలిపారు. రూ.10వేలు ఇచ్చి టిక్కెట్టు కొనుగోలు చేసే భక్తులకు కల్పించే దర్శనంపై టీటీడీ పునరాలోచించాలని సూచించారు. టిక్కెట్ల సంఖ్యను తగ్గించైనా గతంలో కల్పించిన విధంగానే శ్రీవాణి ట్రస్టు భక్తులకు టీటీడీ దర్శనం కల్పించాలి అంబికా కృష్ణా కోరారు. 

Updated Date - 2021-02-27T14:49:34+05:30 IST