రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి: మండాది వెంకట్రావు
ABN , First Publish Date - 2022-07-04T21:56:43+05:30 IST
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేశారు. ప్రజా పంపిణీలో రాష్ట్రానికో రకంగా కమీషన్ ఉండటం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా డీలర్లందరికి
విజయవాడ: తమ సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేశారు. ప్రజా పంపిణీలో రాష్ట్రానికో రకంగా కమీషన్ ఉండటం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా డీలర్లందరికి ఒకే కమీషన్ ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 29 వేల మంది డీలర్లు కరోనా సమయంలోనూ నిత్యావసరాలు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎండీయూలను ఏర్పాటు చేసి రేషన్ పంపణీ చేయడం సరికాదని రేషన్ డీలర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.