తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-01-22T05:18:40+05:30 IST
తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం ఆగదని అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘం నాయకులు హెచ్చరించారు.
హిందూపురం టౌన, జనవరి 21: తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం ఆగదని అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘం నాయకులు హెచ్చరించారు. ఫిబ్రవరి 23, 24న చేపట్టిన సమ్మెకు సంబంధించి శుక్రవారం ఉద్యోగ సంఘం నాయకులు తపాలా అసిస్టెంట్ సూపరింటెండెంట్ శుక్రవారం క్లాస్-3 కార్యదర్శి హరినాథ్, క్లాస్-4 కార్యదర్శి గణే్షలు వినతిని అందజేసి వారు మాట్లాడుతూ నూతన విఽధాన పెన్షనను రద్దుచేసి పాత పెన్షన విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. తపాలాశాఖపై ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నారు. 18నెలల డీఏ బకాయిలు చెల్లించి జీడీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. న్యాయమైన 22 డిమాండ్లను పరిష్కరించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. లేదంటే దశలవారీగా ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. ఫిబ్రవరి 23, 24న జరిగే సమ్మెకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘురాముడు, గిరీష్, రవిశంకర్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.