తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-02-27T05:37:01+05:30 IST
తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని ఆ సంఘం కార్యద ర్శులు కె.గణపతి, ఎల్.బాబూ రావు, డి.సూర్యనారాయణలు డిమాండ్ చేశారు. నగరంలో ని తపాలా డివిజనల్ సూప రింటెండెంట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు శుక్రవారం ఆందోళన చేశారు.
గుజరాతీపేట: తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని ఆ సంఘం కార్యద ర్శులు కె.గణపతి, ఎల్.బాబూ రావు, డి.సూర్యనారాయణలు డిమాండ్ చేశారు. నగరంలో ని తపాలా డివిజనల్ సూప రింటెండెంట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ, టార్గెట్లు అప్పగించి ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. జీడీఎస్లకు జీతా లు/పెయిడ్ లీవ్లను నిలిపివేశారన్నారు. సమస్యలపై మార్చి 17న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అనంతరం డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ వైఎస్ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కె.చంద్రశేఖరరావు, జ్యోతీశ్వరరావు, ఎన్.కామేశ్వరరావు, ఈశ్వరరావు, దమయంతి, తదితరులు పాల్గొన్నారు.