సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-25T06:20:22+05:30 IST

అపరిస్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌ఆర్‌ టీసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

సమస్యలను పరిష్కరించాలి
సిరిసిల్ల డిపో ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు

సిరిసిల్ల టౌన్‌, మే 24 : అపరిస్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌ఆర్‌ టీసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళ వారం మధ్యాహ్నం బోజన విరామం సమయంలో సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట టీఎస్‌ఆర్‌టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  కేఎంపీఎల్‌, ఈపీకే పేరిట డిపో అధికారులు కార్మికులను వేదింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సీసీఎస్‌కు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఆర్టీసీలో యూనియన్‌ల గడుపు ముగిసిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో యూనియన్లను పునరుద్ధరించాలని కోరారు.  

Updated Date - 2022-05-25T06:20:22+05:30 IST