నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-24T06:40:43+05:30 IST

మండపేట నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని కోనసీమ జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో కోరినట్టు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పారు.

నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలి

 మండపేట, మే 23: మండపేట నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని కోనసీమ జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో కోరినట్టు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పారు. సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్‌, మంత్రులు పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్స సమావేశంలో సమస్యలను మంత్రులకు, అధికారులకు వివరించానన్నారు. రాయవరం మండలంలో 1156మందికి ఏడాదిన్నర నుంచి ఇళ్ల పట్టాలు ఇవ్వ డం లేదని, మండపేట మండలం వెలగతోడులో గత ప్రభుత్వం ఇచ్చిన 208 ఇళ్ల పట్టాలను తీసుకుని,ఇప్పటివరకు వారికి పట్టాలు ఇవ్వలేదన్నారు. అలాగే తదితర సమస్యలు మంత్రులకు వివరించానన్నారు. సమస్యల పరిష్కారానికి ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్‌ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. 




Updated Date - 2022-05-24T06:40:43+05:30 IST