పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2022-01-24T03:55:39+05:30 IST

సమస్యలు పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో చిప్ప నర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో జనాభా ప్రతిపాదికన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 23: సమస్యలు పరిష్కారానికి పోరాటాలే మార్గమని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో చిప్ప నర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీల్లో జనాభా ప్రతిపాదికన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 3న మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ఆం దోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. జీవో నెంబరు 317ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, టీచర్లను జిల్లా ఆధారంగా స్థానికతను చూడాల న్నారు. అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. ఈనెల 28న పోడు భూములు, ఇతర సమస్యలపై ఛలో కలెక్ట రేట్‌ చేపట్టాలని, దీనికి పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, మేకల దాసు, ఇప్పకాయల లింగ య్య, జోగుల మల్లయ్య, కలీందర్‌ఆలీఖాన్‌, నరేష్‌, చంద్రశేఖర్‌, బీమనాధుని సుదర్శన్‌, కిషన్‌రావు,  దేవవరం పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T03:55:39+05:30 IST