వివాదాస్పద ఎక్సైజ్ అధికారిపై విచారణ
ABN , First Publish Date - 2020-07-11T08:49:02+05:30 IST
వివాదాస్పద ఎక్సైజ్ అధికారిపై విచారణ
గుంటూరు, జూలై 10: ఎక్సైజ్శాఖలో వివాదాస్పద అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గతంలో ఎక్సైజ్శాఖలో పనిచేసి ప్రస్తుతం ఎస్ఈబీ పరిధిలోకి వచ్చిన ఓ అధికారిపై ఇటీవల సంబంధితశాఖలో పెద్ద ఎత్తు న ఆరోపణలు వచ్చాయి. మహిళా ఉద్యోగినులపట్ల ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన వేధింపులు, అవినీతి ఆరోపణలపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం కలకలం రేపింది.