యోగి ఆదిత్యనాథ్‌కు ప్రియాంక లేఖాస్త్రం

ABN , First Publish Date - 2020-09-19T20:19:11+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న తీవ్ర నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కాంగ్రెస్..

యోగి ఆదిత్యనాథ్‌కు ప్రియాంక లేఖాస్త్రం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న తీవ్ర నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా శనివారంనాడు లేఖ రాశారు. ఖాళీగా ఉన్న పోస్టులపై సమాచారం ఇవ్వాలని అన్ని ప్రభుత్వ శాఖలను ముఖ్యమంత్రి శుక్రవారం ఆదేశించిన నేపథ్యంలో ప్రియాంక ఈ లేఖ రాశారు.


'నిరుద్యోగితపై అనేక మంది కోర్టు మెట్లెక్కుతున్నారు. వీరిలో యువతే ఎక్కువ మంది. యువత జీవితాలు దుర్భరమవుతున్నాయి. వారి బాధలు వింటుంటే హృదయం బరువెక్కుతోంది. వారిలో కొంతమంది తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబ భారం కూడా వారిపై ఉంది' అని ఆ లేఖలో ప్రియాంక పేర్కొన్నారు. టీచర్ అపాయిమెంట్ పరీక్షలు పూర్తి చేసిన 12,460తో తాను మాట్లాడానని, 24 జిలాల్లో వీరి నియామకాలు జరపాల్సి ఉందని అన్నారు. ఏళ్లు గడుస్తున్నా నియామకాలు జరగడం లేదన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి ఆయా జిల్లాల్లో అర్హులైన వారికి తక్షణం నియామకాలు చేపట్టాలని ప్రియాంక కోరారు.

Updated Date - 2020-09-19T20:19:11+05:30 IST