ప్రియాంక కాన్వాయ్‌ను మళ్లీ అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-20T21:04:36+05:30 IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఆయన కాన్వాయ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు..

ప్రియాంక కాన్వాయ్‌ను మళ్లీ అడ్డుకున్న పోలీసులు

లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఆయన కాన్వాయ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారంనాడు అడ్డుకున్నారు. లక్నోకు ఆమె వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డగించారు. అనుమతి లేదని, ముందుకు వెళ్లనిచ్చేది లేదని చెప్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసింది. దీంతో ప్రియాంక తిరిగి కారులోకి వెళ్లి కూర్చున్నారు.  ఒక దొంగతనం కేసులో పట్టుబడి పోలీసు కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక లక్నో బయలుదేరారు.


కాగా, యూపీ పోలీసులు తనను ఎక్కపడితే అక్కడ అడ్డుకుంటున్నారంటూ మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక మండిపడ్డారు. ''వాళ్లు (పోలీసులు) నన్ను ఆగ్రా వెళ్లొద్దన్నారు. నేను ఎక్కడికి వెళితే అక్కడ ఆపేస్తున్నారు. వాళ్లు రాజకీయంగా బాగుండటం కోసం నేను రెస్టారెంట్లలో కూర్చుండిపోవాలా? వాళ్లను (బాధిత కుటుంబాలను) కలుసుకోవాలనుకుంటున్నారు. ఇందులో ఏముంది?''అని ప్రియాంక ప్రశ్నించారు.

Updated Date - 2021-10-20T21:04:36+05:30 IST