ఆ నీచానికి ఫుల్‌స్టాప్ పెట్టండి: ప్రియాంక

ABN , First Publish Date - 2021-12-18T01:20:33+05:30 IST

''అత్యాచారాన్ని నిలువరించలేనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి'' అంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ ..

ఆ నీచానికి ఫుల్‌స్టాప్ పెట్టండి: ప్రియాంక

న్యూఢిల్లీ: ''అత్యాచారాన్ని నిలువరించలేనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి'' అంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. "కేఆర్ రమేష్ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండనార్హమే. ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. అత్యాచారం అత్యంత నీచమైన పని. ఫుల్‌స్టాప్.'' అని ప్రియాంక ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


దీనికి ముందు, రమేష్ కుమార్ సైతం తన వ్యాఖ్యలపై ఓ ట్వీట్‌లో క్షమాపణలు తెలిపారు. ''అసెంబ్లీలో నిర్లక్ష్యంగా చేసిన ప్రకటనకు గాను ప్రతి ఒక్కరికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అత్యాచారం వంటి నీచమైన నేరాన్ని తేలికగా తీసుకోవడం నా ఉద్దేశం కాదు. ఇకపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటా'' అని ఆ ట్వీట్‌లో రమేష్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T01:20:33+05:30 IST