స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-03-05T22:05:17+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావు: సోమిరెడ్డి

నెల్లూరు: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఎవరికీ ఉద్యోగాలు రావని చెప్పారు. విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్రంలోని అనేక కంపెనీలు,.. ఓడరేవులను ప్రైవేట్‌కు అమ్మేస్తారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్ర బంద్ ప్రశాంతంగా నడుస్తోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నెల్లూరులోఆర్టీసీ బస్సులను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బందితో ఆందోళన కారులు వాగ్వాదానికి దిగారు. ఇది మినహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగానే కొనసాగుతోంది.

Updated Date - 2021-03-05T22:05:17+05:30 IST