ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దేశాభివృద్ధికి చేటు

ABN , First Publish Date - 2021-11-30T06:28:58+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దేశాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దేశాభివృద్ధికి చేటు
దీక్షా శిబిరంలో మట్లాడుతున్న డి.ఆదినారాయణ

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, నవంబరు 29: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దేశాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 291వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో  ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యూఆర్‌ఎం-2, ఎస్‌టీఎం, ఎస్‌బీఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.  విజయవాడకు చెందిన ఏపీఎస్‌ ఆర్టీసీ నాయకుడు జి.సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.వెంకటేశ్వర్లు, గంధం వెంకటరావు, జి.ఆనంద్‌, దేముడు, రాజు, సూరిబాబు, సుబ్బారావు, శ్రీనివాస్‌, రమణారావు, మహ్మద్‌, గంగవరం గోపి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-30T06:28:58+05:30 IST