నేడు ప్రైవేటు ఆస్పత్రులతో ఈటల భేటీ
ABN , First Publish Date - 2020-07-05T07:12:58+05:30 IST
ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం భేటీ కానున్నారు. కరోనా చికిత్సకు సంబంధించి
హైదరాబాద్, జులై 4 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం భేటీ కానున్నారు. కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సడలింపులివ్వాలని ప్రైవేటు ఆస్పత్రులు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటులో వైద్యానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రులు కోరుతున్న మినహాయింపులపైనా చర్చించనున్నట్లు సమాచారం.