మంత్రి ఈటలతో భేటీ కానున్న ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు

ABN , First Publish Date - 2020-08-13T20:33:54+05:30 IST

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో..

మంత్రి ఈటలతో భేటీ కానున్న ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు

హైదరాబాద్: కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన ధరల పట్టికను ఆస్పత్రి ఆవరణలో అందరికీ కనిపించేలా ప్రముఖంగా పెట్టాలని ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు ఇచ్చే బిల్లు వివరంగా ఉండాలని, ఏయే మందులు వాడారు? వాటికి ఎంత చార్జి చేశారు? తదితర వివరాలను బిల్లులో చూపించాలని ఆదేశించింది.

Updated Date - 2020-08-13T20:33:54+05:30 IST