కాసులు దండుకుంటున్నారు..!

ABN , First Publish Date - 2020-08-13T00:06:33+05:30 IST

ఇప్పుడంతా కరోనా కాలం. ఆస్పత్రులు దోచుకునే కాలం. పేషెంట్లను పీడించుకుతినే కాలం. రోగులను ..

కాసులు దండుకుంటున్నారు..!

ప్రకాశం: ఇప్పుడంతా కరోనా కాలం. ఆస్పత్రులు దోచుకునే కాలం. పేషెంట్లను పీడించుకుతినే కాలం. రోగులను చేర్చుకుంటున్న ఆస్పత్రులు వారిని మొత్తం పిండేశాక సారీ అంటూ చేతులు దులుపుకుంటున్నాయి. 


ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రి  వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యం తీరును ఎండట్టారు. తమ వారి మృతదేహాన్ని అప్పగించాలంటే లక్షల్లో బిల్లులు చెల్లించాలని వేధిస్తున్నారంటూ రోడ్డెక్కారు. గత నెల 24న ఆస్పత్రిలో అడ్మిట్ చేసిన నూర్జహాన్ అనే మహిళకు పరీక్షలు నిర్వహించి 29న గుండెకు ఆపరేషన్ చేశారు. అనంతరం ఈ నెల 1న ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. 7న నూర్జహాన్ కరోనాతో మరణించిందని చెప్పారు. దీంతో అవాక్కైన నూర్జహాన్ బంధువులు ఆందోళనకు దిగారు. అసలు కరోనా టెస్టులు చేయకుండా ఆస్పత్రిలో ఎలా అడ్మిట్ చేసుకున్నారు. ఆపరేషన్ ఏం చేశారు. ఏ రోజు ఏ మందులు వాడారో తమకు తెలపాలని నూర్జహాన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-08-13T00:06:33+05:30 IST