తమిళనాడులో ప్రైవేట్ జీమ్ సెంటర్లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి

ABN , First Publish Date - 2020-08-05T21:14:20+05:30 IST

తమిళనాడులో ప్రైవేట్ జీమ్ సెంటర్లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి

తమిళనాడులో ప్రైవేట్ జీమ్ సెంటర్లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి

చెన్నై: లాక్ డౌన్ నుంచి కేంద్రం సడలింపులు ఇవ్వడంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ జీమ్ సెంటర్లను పునప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 10 నుంచి జీమ్ సెంటర్లను తిరిగి తీసేందుకు అనుమతించినట్లు తమిళ ప్రభుత్వం పేర్కొంది. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్ల కోసం ప్రైవేట్ జిమ్‌లను తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి ప్రామాణిక ఆపరేషన్ విధానం జారీ చేయబడుతుందని టిఎన్ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి తెలిపారు.


Updated Date - 2020-08-05T21:14:20+05:30 IST