ప్రైవేట్‌ ఉద్యోగి చోరీల బాట

ABN , First Publish Date - 2020-06-30T10:08:31+05:30 IST

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు

ప్రైవేట్‌ ఉద్యోగి చోరీల బాట

నిందితుడి అరెస్టు, రూ. 3 లక్షలు, ద్విచక్ర వాహనం స్వాధీనం


ఏఎ్‌సరావునగర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట ఇందిరానగర్‌కు చెందిన ఎరుకల అశోక్‌కుమార్‌గౌడ్‌(26) ప్రైవేట్‌ ఉద్యోగి. ఈనెల 25వ తేదీన కుషాయిగూడ సుభా్‌షనగర్‌లో తాళం వేసిన ఇంట్లో చొరబడి బీరువాలో భద్రపరిచిన రూ. 3 లక్షలు అపహరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం నేతాజీనగర్‌ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశోక్‌కుమార్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి రూ. 3 లక్షలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. అతడు 2019 ఫిబ్రవరిలో నాచారం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆరుచోట్ల చోరీలు చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. 

Updated Date - 2020-06-30T10:08:31+05:30 IST