Pune-Bengaluru బస్సును ఢీకొన్న లారీ...ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2022-05-24T15:57:22+05:30 IST

పూణే-బెంగళూరు మధ్య ఉన్న 4వనంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు....

Pune-Bengaluru బస్సును ఢీకొన్న లారీ...ఏడుగురి మృతి

26 మంది ప్రయాణికులకు గాయాలు

బెంగళూరు: పూణే-బెంగళూరు మధ్య ఉన్న 4వనంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పూణే నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు బస్సు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 26మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుబ్బలిలోని కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.బస్సు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బయలుదేరి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.


Updated Date - 2022-05-24T15:57:22+05:30 IST