ప్రైవేటు బస్సుల ఆలోచన విరమించుకోవాలితి: ఈయూ

ABN , First Publish Date - 2020-02-22T08:49:14+05:30 IST

ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులు తిప్పాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని

ప్రైవేటు బస్సుల ఆలోచన విరమించుకోవాలితి: ఈయూ

విజయవాడ, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులు తిప్పాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అధ్యక్షులు వైవీ రావు హెచ్చరించారు. ఆర్టీసీని కాపాడటానికి, ఉద్యోగులకు అండగా ఉండటానికి ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెబుతుంటే.. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేయటానికి పీటీడీ యాజమాన్యం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆర్టీసీ ఎండీ ప్రకటనపై శుక్రవారం ఈయూ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-02-22T08:49:14+05:30 IST