టీడీపీ డాక్టర్స్ సెల్ కార్యదర్శిగా ప్రీతమ్కృష్ణ
ABN , First Publish Date - 2022-06-30T04:43:09+05:30 IST
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డాక్టర్స్ సెల్ సెక్రటరీగా స్వర్ణ ప్రీతమ్ కృష్ణ బుధవారం నియమితులయ్యారు. టీడీపీ కార్య క్రమాల్లో ప్రీతమ్ చురుగ్గా పాల్గొంటున్నారు.
పొదిలి, జూన్ 29 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డాక్టర్స్ సెల్ సెక్రటరీగా స్వర్ణ ప్రీతమ్ కృష్ణ బుధవారం నియమితులయ్యారు. టీడీపీ కార్య క్రమాల్లో ప్రీతమ్ చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రీతమ్ కృష్ణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ స్వర్ణగీత కుమారుడు. స్వర్ణగీత పొదిలి మాజీ సర్పంచ్గా, ప్రజా వైద్యురాలిగా ఈ పరిసర ప్రాంత ప్రజలకు సుపరి చితులు. యువనాయకుడు ప్రీతమ్ కృష్ణ మా ట్లాడుతూ తనకు పదవి వచ్చేందుకు సహకరించిన మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేష్, రా ష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చె న్నాయుడుకి, మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి, జిల్లా, మండల పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు.