పరిశుభ్రతపై అవగాహన

ABN , First Publish Date - 2022-05-29T06:14:51+05:30 IST

పరిశుభ్రతపై అవగాహన

పరిశుభ్రతపై అవగాహన
ఉయ్యూరులో రుతుస్రావ పరిశుభ్రత అవగాహన ర్యాలీలో కమిషనర్‌ సత్యనారాయణ, మెప్మా అధికారులు

ఉయ్యూరు, మే 28 :  కాకాని గిరిజన కాలనీలో శనివారం మెప్మా ఆధ్వర్యంలో  ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత అవహన కార్యక్రమం నిర్వహించారు. 8వ సచివాలయ పరిధిలో రుతు స్రావ పరిశుభ్రతపై అవగాహన ప్రదర్శన అనంతరం సమా వేశం నిర్వహించారు. అర్బన్‌ హెల్త్‌క్లినిక్‌ అధికారి డాక్టర్‌ కోసూ రి మీనాదేవి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. రుతుస్రావం విషయమై సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు.  కమిషనర్‌ చక్కా సత్యనారాయణ, వైస్‌చైర్మన్‌ అర్షతున్నీసా, వార్డు కౌన్సిలర్‌  ఎం. లక్ష్మి,  ఎస్‌.దయావతి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T06:14:51+05:30 IST