పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-01-19T04:53:29+05:30 IST
పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
తాండూరు/బంట్వారం (కోట్పల్లి) : విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, దీంతో తాండూరు నియోజకవర్గ పరిధిలోని 258 పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈడీ సీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిన్గుర్తి సమీపంలో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరులన మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ది పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 258 ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేసేందుకు మండలాలవారీగా నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
- ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
తాండూరు నియోజకవర్గ పరిధిలో పారుతున్న కాగ్నానదిపై పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి నుంచి కర్ణాటక శివారు బషీరాబాద్ మండలం క్యాద్గిరా వరకు 11 చెక్డ్యాంలు నిర్మించనున్నారు. వాగు వెంట ఉన్న భూముల్లో సాగు కూడా పెరగనుంది. తాండూరు నియోజవర్గ పరిధిలో 5చెక్డ్యాంలు నిర్మాణ దశలో ఉండగా మరో 6 చెక్డ్యాంలు పరిపాలన ఆమోదంలో ఉన్నాయి. కాగా, చెక్డ్యాంల నిర్మాణం పురోగతిపై ఎమ్మెల్యే మంగళవారం ఇరిగేషన్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోట్పల్లి ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలను ఆధునీకరించి పనులు పూర్తయేలా చూడాలని సూచించారు. యాలాల మండలంలోని శివసాగర్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈఈ సుధీర్, డీఈలు పాల్గొన్నారు.