‘మన ఊరు మన బడి’ లో 12 రకాల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం: మంత్రి సబితారెడ్డి

ABN , First Publish Date - 2022-05-02T23:06:38+05:30 IST

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన వూరు మన బడి’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు.

‘మన ఊరు మన బడి’ లో 12 రకాల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం: మంత్రి సబితారెడ్డి

హైదరాబాద్: పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం  ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  మంత్రి సబితాఇంద్రారెడ్డి, మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి సందీవ్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవ సేన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో  రాష్ట్రంలో 26 ,065 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.


అనంతరం  మంత్రి హరీష్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.  ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటిని సీనియర్ అధికారులతో మరోసారి తనిఖీ చేయించాలన్నారు.ఇప్పటికే జిల్లాలకు ముందస్తుగానే కొన్ని నిధులు విడుదల చేశామన్నారు.మే నెలాఖరులోగా టెండర్లన్నింటినీ పూర్తి చేసి పనులను ప్రారంభించాలని సీ.ఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Read more