అభివృద్ధి పనులకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-09-23T10:57:40+05:30 IST
ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు.
ఎల్.ఎన్.పేట, సెప్టెంబరు 22: ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. లక్ష్మీనర్సుపేట పీహెచ్సీలో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్దాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పీహెచ్సీలో వివిధ పనులను ‘నాడు-నేడు’ పఽథకంలో రూ.51 లక్షలతో చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి టి.ప్రవల్లిక, నాయకులు పాల్గొన్నారు.
హిరమండలం: ‘నాడు-నేడు’లో భాగంగా హిరమండలం పీహెచ్సీలో అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.85 లక్షలతో ఆసుపత్రి లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభావతి, పీఏసీ ఎస్ చైర్మన్ ఏవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.